జిల్లెళ్ళ, కట్కూర్ గ్రామాల్లో నూతన భవనాలకు భూమిపూజ
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని జిల్లెళ్ళ గ్రామంలో 12 లక్షల రూపాయలతో నూతన అంగన్వాడి భవనం, 10 లక్షల రూపాయలతో లక్ష్మీ మహిళా సమాఖ్య సంఘం భవనం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అలాగే కస్బీ కట్కూర్ గ్రామంలో సమన్వయ, భగవతి మహిళా వీవో మహిళా సమాఖ్య భవనాలకు 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు కావడంతో ఆ భవనాల నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగ్ గౌడ్, జిల్లెళ్ళ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్, కట్కూర్ సర్పంచ్ బొడ్డు స్వాతి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పబ్బతి కృష్ణారెడ్డి, మునిగల రాజు, రాజేశ్వర్ రావు, నరేందర్, శ్రీనివాస్, ఆయా గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. భవనాల నిర్మాణం చేపట్టడం పట్ల మహిళా సంఘాల సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




