calender_icon.png 5 November, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన నలుగురు మృతి

05-11-2025 10:58:10 AM

  1. కర్ణాటకలోని బీదర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
  2. ఎదురెదురుగా ఢీకొన్న కారు, డీటీడీసీ వాహనం..
  3. తెలంగాణకు చెందిన నలుగురు మృతి.
  4. అమ్మవారి దర్శనానికి వెళ్లివస్తుండగా ఘటన.

బీదర్‌ : కర్ణాటకలోని(Karnataka) గంగాపూర్‌లోని దత్తాత్రేయ ఆలయానికి వెళ్లిన తెలంగాణ( Telangana residents) నారాయణఖేడ్ మండలంలోని జగన్నాథపూర్‌కు చెందిన నలుగురు యాత్రికులు బుధవారం తెల్లవారుజామున బీదర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు నవీన్(40), నాగరాజు(40), రాచప్ప(45), కాశీనాథ్(60)గా గుర్తించారు. కార్తీక పౌర్ణమి(Kartik Purnima) సందర్భంగా ప్రార్థనలు చేయడానికి ఐదుగురు భక్తులు నారాయణఖేడ్(Narayankhed) నుండి గంగాపూర్‌కు కారులో ప్రయాణించి ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురెదురుగా కారు, డీటీడీసీ వాహనం ఢీకొన్నాయి. క్షతగాత్రులను బీదర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే బంధువులు, స్నేహితులు బీదర్‌కు బయలుదేరారు.