18 April, 2026 | 10:03 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం

05-11-2025 01:40 PM

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వద్దతుగా ఆయన యూసఫ్ గూడ డివిజన్ లోని వెంకటగిరిలో ఇంటింటి ప్రచారం పాదయాత్ర నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా చేశారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.