25 July, 2026 | 6:00 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

చెరువుగట్టు ఆలయంలో తడి బట్టల దర్శనానికి అనుమతి కల్పించాలి

05-11-2025 01:15 PM

నిషా క్రాంతి జోగిని

నకిరేకల్,(విజయక్రాంతి): చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని తడి బట్టలతో స్నానం చేసి దర్శించుకోవడం వల్ల భక్తుల అనేక రోగాలు తీరుతాయని ప్రజల నమ్మకం ఉందని, ఆ ఆచారాన్ని కొనసాగించాలని నిషా క్రాంతి జోగిని విజ్ఞప్తి చేశారు.బుధవారంకార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ఆమె, దేవస్థానంలో అభివృద్ధి లేమిపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచీ ఆలయానికి వస్తున్నానని, కానీ ఇప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదని ఆమె తెలిపారు.గుట్టపైకి రాగానే ఎదురుగా ఉన్న మరుగుదొడ్లు భక్తుల పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని, అవి తొలగించి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు.అమావాస్య, పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తున్నా తాగునీరు, స్నానం, విశ్రాంతి వంటి సదుపాయాలు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.ప్రభుత్వం, దేవాదాయ శాఖ భక్తుల సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం చూపడం తగదని విమర్శిస్తూ, చెరువుగట్టు ఆలయాన్ని తగిన రీతిలో అభివృద్ధి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.