23-06-2025 05:36:15 PM
ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరిన ఐటీడీఏ పీవో రాహుల్..
భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో జూన్ 29 తేదీన, మండల కేంద్రమైన దుమ్ముగూడెంలో జూన్ 30వ తేదీన నిర్వహించే ఉచిత క్యాన్సర్ నిర్ధారణ క్యాంపు, కంటి శాస్త్ర శిబిరాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలనీ భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రాహుల్(ITDA Project Officer Rahul) కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి భద్రాచలం వారి ఆధ్వర్యంలో ఎస్ఆర్ ఐ వాసవి అసోసియేషన్ యుఎస్ఏ వారి సహకారంతో పేద ప్రజలు, గిరిజన సంక్షేమం కొరకు ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరములు ఆదివాసీ గిరిజనులు, పేద ప్రజల సంక్షేమం కోసం భద్రాచలంలోని మారుతి నర్సింగ్ నర్సింగ్ కాలేజి నిర్వహించన్నట్లు తెలిపారు.
ఈ ఆరోగ్య శిబిములకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేస్తూ, వైద్య ఆరోగ్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరములలో కేన్సర్ లక్షణాలు గల వారికి ప్రఖ్యాతి చెందిన కేన్సర్ వ్యాధి చికిత్సలో నిపుణులైన యంఎన్ జె కేన్సర్ ఆసుపత్రి హైదరాబాద్ 1000 పడకల ఆసుపత్రి వారి బృందముతో పాటు భద్రాచలంకు చెందిన డాక్టర్ వి. జయభారతి స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ యం.మధుమోహన్ రెడ్డి- సర్జికల్ ఆంకాలజిస్టు, డాక్టర్ పి. ప్రజ్ఞ గైనిక్ ఆంకాలజిస్ట్ నిపుణులైన వైద్యులచే నిర్వహించబతున్నదని, పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్సా శిబిరము నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కంటి శుభ్రమునకు హాజరైన వారిని పరీక్షించివి అవసరమైన వారికి కేటరాక్ట్ కంటి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించబడునని తెలియజేశారు. గిరిజన ప్రాంతంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ కంటి వైద్య శిబిరాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్న పీవో కు ఈ సందర్భంగాధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్. ఎల్. కాంతారావు తెలిపారు. ఈ శిబిరములో ఉచితంగా పరీక్షలు చేసి ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఆ పథకం ద్వారా ఉచితంగా వైద్య చికిత్స అందించబడునని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు, అదులకు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్. చైతన్య రెడ్ క్రాస్ సంఘ నాయకులు వై సూర్యనారాయణ, ఎ.జగదీష్, బి.రాజారెడ్డి, వి. కామేశ్వరరావు, కె. అబ్రహం, గట్టు వెంకటాచారి, నక్కా వెంకన్న యాదవ్, డాక్టర్ భాను ప్రసాద్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.