calender_icon.png 23 June, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి

23-06-2025 05:42:47 PM

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు(Additional Collector D. Venu)తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన సి.హెచ్. లక్ష్మీ  సర్వే నెంబర్ 80లో 2 ఎకరాల భూమి 1994లో ప్రభుత్వం కేటాయించిందని, దీనికి రైతు బంధు, పట్టా పుస్తకం రాలేదని, తనకు రైతు భరోసా ఇప్పించాలని, భూ పట్టా హక్కులను భూ భారతి ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ రామగిరికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన ఎం. సదయ్య సర్వే నెంబర్ 47 గ్రామ శివారులో గల ప్రభుత్వ భూమిని సాగులో ఉంటున్న మాకు మోకా సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ మంథనికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

కమాన్ పూర్ మండలం సబ్బితం గ్రామానికి చెందిన పులిపాక చుక్కమ్మ తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పి.డీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామానికి చెందిన కే.రాజయ్య తమ గ్రామంలో ఉన్న తన భూమిలో నూతన బోర్ వెల్ వేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా భూగర్భజలాల అధికారిక రాస్తూ పరిశీలించి వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.