31 March, 2026 | 1:55 AM

డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు

31-03-2026 12:00 AM

ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ వాహన నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రారంభించబడిన ‘అరైవ్ అలైవ్‘ కార్యక్రమం సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అన్నపూర్ణ, నాయకులు ఆడే గజేందర్, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్‌ఐలు పురుషోత్తం, సంజయ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీసు డాక్టర్ శాంతరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.