21-08-2025 11:15:55 AM
నల్లగొండ టౌన్(విజయక్రాంతి): మూడవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ సత్యవతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత వైద్యం(Free medical camp) ఏర్పాటు చేసినట్లు ఎముకలు, నరాల వైద్య నిపుణులు డాక్టర్ సూరే పల్లి రాం మనోహర్ గురువారం తెలిపారు. ఈ శిబిరంలో రూ. 2500 విలువ గల బిఎండి పరీక్షలు ఉచితంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. దానితోపాటు రోగులకు ఉచిత ఓపి, అన్ని రకాల స్కానింగ్, రక్త పరీక్షలపై 50 శాతం డిస్కౌంట్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.