06-06-2025 10:39:59 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని ఇప్పలచేలక, కొప్పురాయి, ఒడ్డుగూడెం గ్రామాలలో ఇట్స్ చారిటీ టైం ఆధ్వర్యంలో అమృత, ఏ జి ఎస్ హాస్పిటల్, అపోలో ల్యాబ్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు ఇట్స్ చారిటీ టైం ఇంచార్జి నరేష్ కుమార్, గ్రేడ్ 3 సెక్రటరీ ఏఎంసీ ఇల్లందు జి రంజిత్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 325 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు.