30-10-2025 08:15:46 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): శ్రీరాజమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పోచారం మున్సిపల్ అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో గురువారం వికలాగులకు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల కాలనీ కడియం ఉమారాణికి ఉచితంగా వీల్ చైర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజమాత ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ రెడ్డి, వైఫ్ ప్రెసిడెంట్ మనోజ్ రెడ్డి, టీం సభ్యులు సామ్రాట్ బొల్లం కుమార్, శృతి, పవన్ పాల్గొన్నారు.