23 June, 2026 | 11:57 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

రైతులు అధైర్య పడవద్దు

30-10-2025 08:14 PM

నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం ఎమ్మెల్యే..

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటలు నష్టపోగా నేడు రుక్మాపూర్ గ్రామంలో నేలకొరిగిన వరి పత్తి మొక్కజొన్న పంటలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పరిశీలించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో మాట్లాడి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతు పండించిన చివరి గింజ వరకు కొంటామని ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.