10 March, 2026 | 6:13 AM

ఆపదలో ఉన్న స్నేహితున్ని ఆదుకున్న మిత్రులు

03-12-2025 12:00 AM

భీమదేవరపల్లి, డిసెంబర్ 2 (విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన మాడుగుల బిక్షపతి కిడ్నీలు దెబ్బతిని అనారో గ్యంతో బాధపడుచుండగా, ముల్కనూర్ హైస్కూల్ లో 1986 సంవత్సరంలో తనతోపాటు చదువుకున్న స్నేహితులు స్పం దించి ఆయనకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గిరబోయిన కొమురయ్య, మాడుగుల శ్రీనివాస్, చిదురాల శ్రీనివాస్,గంజి రాజమౌళి, సంపత్,ప్రభాకర్, రవీందర్ పాల్గొన్నారు.