30-06-2025 03:28:28 AM
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, జూన్ 29:శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటా న్చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు అవుతున్న కాలనీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చె రు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మించిన క మ్యూనిటీ హాల్ ను ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీతో పాటు సమీప కాలనీల ప్రజల కోసం రూ.7 కోట్లు వెచ్చించి మౌలిక వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు.
కాలనీలో గుడి, మసీదు, చర్చి నిర్మాణాల కోసం రూ.30 లక్షల సొంత నిధులు అందించడం జరిగిందని గుర్తు చేశారు. అతి త్వరలో మరో రూ.70 లక్షలు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, రాజు, కృష్ణ, శ్రీకాంత్, మల్లేష్, బీహెచ్ఈఎల్ యూనియన్ ప్రతినిధులు రెహమాన్, దామోదర రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.