నిధులు పక్కదారి!
- సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభు త్వం దారి మళ్లిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో సర్పంచ్లకి ఇవ్వాల్సిన నిధులని ఇవ్వకుండా.. సర్పంచ్లని అనేక ఇబ్బందులకి గురి చేసిందని, ప్రశ్నించి న వారిని కేసులు పెట్టి జైల్కి పంపిందని, అనేక మంది సర్పంచ్లు ఆత్మహ త్యలు చేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి.. రెండున్నరేళ్లు అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్ రావును తెలంగాణ మాజీ సర్పం చ్ల సంఘం నేతలు కలిసి... తమ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త సర్పంచ్లు కూడా కొలువు తీరారు..
ఇంకా ఇప్పటివరకు మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు లు ఇవ్వలేదుదన్నారు. 15వ ఆర్థిక సంఘం కింద రూ. 640 కోట్లను విడుదల అయ్యాయని, అయినా మాజీ సర్పంచ్ల బకాయిలు చెల్లించడం లేద న్నారు. నిధులు లేక గ్రామ పరిపాలన కుంటుపడిందని, కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించకుండా మాజీ సర్పంచ్ల బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ల సంఘం పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆయన పేర్కొన్నారు.




