05-06-2025 11:00:29 PM
జనగామ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో హోల్సేల్ గా ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాపు వేమునూరి రాజేంద్రప్రసాద్ హోల్సేల్ రేట్లతో ప్రజల అభిమానం పొంది షాప్ ప్రారంభించారు. ఈ యొక్క షాప్ ఓపెనింగ్ కు జనగామ జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులను అందరిని ఆహ్వానించగా జిల్లా అధ్యక్షులు దీగోజు నరసింహ చారి, జిల్లా అధ్యక్షులు దీగోజు సాంబాచారి ఆధ్వర్యంలో జనగామ జిల్లా కార్పెంటర్స్ అధిక సంఖ్యలో పాల్గొని వేమునూరు రాజేంద్రప్రసాద్ వ్యాపారం మంచి అభివృద్ధి పదంలో జరగాలని కోరారు.
కార్పెంటర్ అందరూ తమ వంతు సహకారాలు ఉంటాయని తెలియజేశారు. జనగామలో మార్వాడి షాపుల వారి కంటే రేట్లు తగ్గింపు ఇచ్చుకుంటూ నాణ్యమైన వస్తువులను అందజేస్తానని వేమునూరు రాజేంద్రప్రసాద్ తెలియజేశారు. కావున జనగామ జిల్లాలోని నూతన గృహములు కట్టుకునే యజమానులకు తక్కువ ధరకే ఫర్నిచర్ ముడి సామాగ్రిని అందజేస్తానని ఇందుమూలంగా వారు తెలియజేశారు.