6 July, 2026 | 4:11 PM

Breaking News

ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •  

రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం

25-08-2025 01:36 AM
  1. అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
  2. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏడీడబ్ల్యూఎస్
  3. అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
  4. అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్ సింగ్

భువనేశ్వర్, ఆగస్టు 24: భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఆదివారం ఉదయం 12.30 గంటలకు ఒడిశా తీరం నుంచి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ (ఐఏడబ్ల్యూఎస్)ను ప్రయోగించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను డీఆర్‌డీవో ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ.

ఇందులో భారత్‌లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్, అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. దీంతో భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేసి విజయవంతంగా ప్రయోగించినందుకు డీఆర్‌డీవో, సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలియజేశారు. 2035 వరకు భారత్ సుదర్శన్ చక్ర ఆయుధ వ్యవస్థను తీసుకురాబోతుందని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ విజయం సుదర్శన్ చక్ర ప్రయోగంలో కీలకం కానుంది.