25-08-2025 01:54:26 AM
రంగారెడ్డి, ఆగస్టు 24( విజయక్రాంతి): బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అవస రమైన మద్దతును ఇవ్వడంతో పాటు రాష్ర్ట ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరి గిన ‘ఆసియా పసిఫిక్ బయో డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్-2025’లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
ఈ వేదికగా ‘ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ - ది బయోడిజైన్ బ్లూ ప్రింట్’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బయోడిజైన్ విధానం ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడం శుభ సూచకమని అన్నారు. ‘భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ ఆవిష్కరణలు ఎంతో అవసరం.
అలాంటి పరిశోధనలకు, ఆవిష్కరణల కోసం తెలంగాణ మద్దతునివ్వడమే కాకుండా వైద్య డేటాను డేటా గోప్యతా ప్రమాణాలకు లోబడి అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నూతన ఆవిష్కరణల కోసం విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములతో అనుసంధానం చేస్తాం. చాలా ఏళ్లుగా మన మేదస్సు ఇతర దేశాల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రతిభ పాటవాలు దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. బయోడిజైన్ విధానం క్లినికల్ అవసరాలకు, ఆచరణాత్మక ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందిస్తాయి. ఈ రంగంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వరరెడ్డి నాయకత్వంలో నూతన ఆవిష్కరణల కోసం పరిశోధనా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయం’ అని పేర్కొన్నారు.
బయో డిజైన్స్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
ప్రపంచవ్యాప్తంగా బయోడిజైన్స్, లైఫ్ సెన్సైస్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మారబోతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఇంటె లిజెన్స్ బయోడిజైన్స్కు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ‘లైఫ్ సెన్సైస్లో జాతీయ స్థా యిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్లో గణనీయమైన పెట్టుబడులు వచ్చా యి.
తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విజన్తో ముందు కు వెళుతోంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి దే శానికి స్వాతంత్య్రం వచ్చి శతాబ్దం పూర్తవుతుందని, అప్పటికి మన దేశం ౩ ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు పొందుతుంది.
వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుల్తాన్పూర్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివెజైస్ పార్క్ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశాం. అక్కడ 60 కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఇక్కడ ప్లాంటేషన్లు, వైద్య పరికరా లు రూపొందిస్తున్నారు. వివిధ రంగాల్లో హైదరాబాద్ ఒక ప్రత్యేకమైన కేంద్రంగా ఎదగడంలో స్థానిక స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం ఎంతో ఉంది’ అని అన్నారు.
యువతపైనే తెలంగాణ భవిష్యత్
తెలంగాణలో అన్ని రంగాలలో ప్రతిభావంతులైన యువత ఉందని, వీరిపైనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మన తెలివితేటలను ప్రపంచానికి ఉపయోగపడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, అందుకు యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మెడికల్ రంగాల్లో పరిశోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని, అందుకు ప్రతిభ ఉన్నవారికి ప్రభుత్వ మెడికల్ డేటా కూడా తాము తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ప్రధానంగా వ్యాపార ఒడిదుడుకులు, యుద్దాల సమస్యలతో ఆయా దేశాలు సతమతమవుతున్నాయని, ఇలాంటి సందర్భంలోనే కొత్త ఆవిష్కరణలకు సరైన వేదికగా తాము భావిస్తున్నామని సీఎం అభిప్రాయపడ్డారు. సమ్మిట్లో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి, బయోడిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ చైర్మన్ డాక్టర్ రాజేశ్ కలపల, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, సెంటర్ ఫర్ బయోడిజైన్ (స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ మైరల్, వైద్య పరిశోధనా రంగంలో వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.