25-09-2025 12:12:59 AM
500 తామర పువ్వులతో ప్రత్యేక అలంకరణ
గజ్వేల్ సెప్టెంబర్ 23: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి అమ్మవారు 500 తామర పువ్వులతో కళ్యాణి అలంకారంలో దర్శనమిచ్చింది. మూడవరోజు బుధవారం గజ్వేల్ మహంకాళి క ళ్యాణి అలంకారంలో భ క్తుల పూజలు అందుకున్నది. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా య ధావిధిగా చండీహవనము, చతుష ష్ట్యూపచార పూజ, గోపూజ, వెయ్యి మందితో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన అర్చ కులు చాడ నంద బాల శర్మ, చంద్రశేఖర్ శర్మలు వైదిక నిర్వహణ చేయగా, అర్చకులు అంకిత్ మిశ్రా, అనూప్ మిశ్రాలు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు నిత్యాన్నదానం నిర్వహించారు.