02-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కాకతీయ కళాక్షేత్రం గణపేశ్వరాలయం కోటగుళ్లలో గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా స్వామివారిని దళపతిగా అలంకరించారు.
అలాగే కరెన్సీ నోట్లతో స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. సోమవారం ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బసవ ప్రసాద్ గౌడ్ స్వామిని దర్శనం చేసుకున్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా అర్చకుడు జూలపల్లి నాగరాజు స్వామివారిని రోజుకో రూపంగా అలంకరిస్తున్నారు.