12 March, 2026 | 9:34 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

డంపింగ్ యార్డులను సందర్శించిన జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్

30-01-2026 12:42 AM

ఘట్ కేసర్, జనవరి 29 (విజయకాంతి): జిహెచ్‌ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని చెత్త సేకరణ డంపింగ్ యార్డ్ కేంద్రాలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణరెడ్డి గురువారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ప్రాథమిక సేకరణ పాయింట్ల పనితీరును పరిశీలించి, ద్వితీయ సేకరణ (సెకండరీ పాయింట్లు) అంశంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. డోర్ టు డోర్ స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

ఎక్కడా కూడా జీవీపీ పాయింట్లు ఉండకుండా పూర్తిగా తొలగించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే ఘట్కేసర్ సర్కిల్లోని ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్) కేంద్రాన్ని కూడా సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వనరులను పునర్వినియోగం చేసే విధంగా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నగర పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపడేలా ప్రతి స్థాయి లో సిబ్బంది సమన్వయంతో పనిచేసి, స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి  సూచించారు.