13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సిట్ నోటీసులు.. ప్రతీకారమే!

30-01-2026 12:43 AM

ప్రభుత్వ తీరుపై సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి ధ్వజం

ఆమనగల్లు, జనవరి 29(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం ఆమనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు.  ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నిర్మాతగా, అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన నోటీసుల పర్వానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు.

సిట్ విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, నిజాలను పక్కన పెట్టి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడటం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ వేధింపులపై చూపే శ్రద్ధను ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై చూపాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరు. ఇలాంటి వికృత చేష్టలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పంతు నాయక్, చుక్కా నిరంజన్ గౌడ్, ఆనంతుల సైదులు, వెంకటేష్, చక్రి, అహ్మద్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.