15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సిట్ నోటీసులు.. ప్రతీకారమే!

30-01-2026 12:43 AM

ప్రభుత్వ తీరుపై సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి ధ్వజం

ఆమనగల్లు, జనవరి 29(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం ఆమనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు.  ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నిర్మాతగా, అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన నోటీసుల పర్వానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు.

సిట్ విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, నిజాలను పక్కన పెట్టి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడటం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ వేధింపులపై చూపే శ్రద్ధను ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై చూపాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరు. ఇలాంటి వికృత చేష్టలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పంతు నాయక్, చుక్కా నిరంజన్ గౌడ్, ఆనంతుల సైదులు, వెంకటేష్, చక్రి, అహ్మద్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.