09-06-2025 01:46:22 AM
యాదాద్రి భువనగిరి జూన్ 8 ( విజయ క్రాంతి ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భం గా నిర్వహించిన గిరి ప్రదర్శనను ఆలయ ఈవో వెంకట్రావు ప్రారంభించగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య దంపతులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.
దాదాపు లక్ష మంది భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం నుండి 11 గంటల వరకు ధర్మ దర్శనం రద్దీ కొనసాగింది. భక్తులతో యాదగిరి కొండ కిటకిటలాడింది. ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను యు వెంకట్రావు మానిటరింగ్ సిస్టం ద్వారా వాటి పనితీరును పరిశీలించారు.