calender_icon.png 5 June, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పోడుదారులకు పట్టాలు ఇవ్వండి

28-05-2025 12:00:00 AM

పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా  అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్

మణుగూరు, మే 27 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టు మల్లారం గ్రామంలో పోడు భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని పినపాక మాజీ ఎ మ్మెల్యే, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. మంగళవారం పోడు పట్టాల సమస్యపై మెరుపు వేగంతో ప్రత్యక్ష పోరాటానికి దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రోజులుగా పోడు భూముల పట్టాల కోసం అర్హులైన దరఖాస్తుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న, అసలైన పోడుదారుల దరఖాస్తులను మాయం చేసి అ న్యాయం చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులపై మండిపడ్డారు.

విషయం తెలుసుకొని ఫారెస్ట్ అధికారులు స్థానికంగా ఉన్న పోడు భూమ్మీ సర్వేలను సమగ్రంగా పరిశీలించారు. ఆయన వెంట మానుగూరు మండల, పట్టణ కన్వీనర్లు కురి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు జావేద్ పాషా , రామరావు, నాయకులు ముద్దొంగుల కృష్ణ, నూకా రమేష్, బుశెట్టి రవి, రామకోటి తదితరులు పాల్గొన్నారు.