12 March, 2026 | 6:53 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

బద్దెనపల్లిలో మేకలు–గొర్రెల అంగడి ప్రారంభం

12-03-2026 05:03 PM

తంగళ్ళపల్లి,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో సర్పంచ్ సిలివేరి లావణ్య చిరంజీవి ఆధ్వర్యంలో మేకలు, గొర్రెల అంగడిని ప్రారంభించారు. మంచి రోజు కావడంతో గురువారం అంగడిని ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఈ అంగడి నిర్వహించబడుతుందని చెప్పారు. 


మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అంగడిని సద్వినియోగం చేసుకోవాలని, మేలురకం మేకలు మరియు గొర్రెలు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య, సిలివేరి నర్సయ్య, వార్డు సభ్యులు కొల్లాపూరి నరేష్, గుగ్గిళ్ల సంజువు, వరలక్ష్మి, శ్రీనివాస్, బాలలక్ష్మి, కనకరాజు, ఆవునూరి వెంకటరాములు, కొక్కిరాల ఆగం రావు, సూర్యారావు, నక్క భాస్కర్, అంజయ్య, శ్రవణ్, దేవయ్య, కొమురయ్యతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు.