30-05-2025 11:42:03 PM
హనుమకొండ,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్న తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. హనుమకొండలోని రాంనగర్ కు చెందిన యువకుడు అబ్దుల్ పాషా పట్టణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్ ఎక్కాడు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం మోసం చేసిందని న్యాయం చేసే వరకు హోర్డింగ్ దిగనని చెప్పారు. హోల్డింగ్ ఎక్కిన అబ్దుల్ పాషా. హోంగార్డ్ లతీఫ్ కొడుకుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగినాడు.