12 May, 2026 | 2:07 AM

ప్రభుత్వానికి ఇది తగునా?

07-05-2024 12:05 AM

ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలకు అందలసిన సౌకర్యాలను ఆపేస్తామంటే ఎలా? గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్మించిన రైతు వేదికల నిర్వహణ కోసం ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని, దాంతో వాటి నిర్వహణ కష్టతరమవుతున్నట్టు వార్తలు రావడం శోచనీయం. ఒక్క మెదక్ జిల్లాలోనే 76 రైతు వేదికలకు గత ఇరవై నెల లుగా రూ. కోటి 29 లక్షల బకాయిలు వున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారులు నిధులు జమ వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

రాంచందర్, మెదక్