12 May, 2026 | 3:12 AM

నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి

07-05-2024 12:05 AM

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ. 40 లక్షలకు పైగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన దరిమిలా యువత అప్రమత్తంగా వుండవలసిన అవసరం ఎంతైనా ఉంది. చదువు పూర్తయ్యాక క్యాంపస్ సెలక్షన్స్ సరిగ్గా జరగక, కొంతమేర ఇంటర్వ్యూలు జరిగినా ఎక్కువ మందికి ఉద్యోగాలు రాకపోవడం వల్ల చాలామంది నిరాశ నిస్పృహలకు లోనవడం సహజం. అందరూ టాప్ పర్సంటేజీతో పాస్ కాలేరు కదా. ఎక్కువ కంపెనీలు మెరిట్ స్టూడెంట్స్‌నే ఎంపిక చేసుకుంటుంటాయి. నిరుద్యోగులు కాలేజీ నుంచి బయటకు వచ్చాక ఆఫ్ క్యాంపస్‌లో ఉద్యోగాలు వెతుక్కోవలసివస్తున్నది. 

 కె.రాజేందర్, మేడ్చల్