calender_icon.png 2 June, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణను తీర్చిదిద్దుతున్న మంత్రి శ్రీధర్ బాబు

31-05-2025 03:26:58 PM

మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ  విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్

మంథని,(విజయక్రాంతి): తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను మంథని గాంధీచౌక్ లో పట్టణ యూత్ అధ్యక్షుడు పెంటరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కేక్ కట్ చేసి బాణా సంఛా పేల్చి డీజె చప్పుళ్లతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని, మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అంతేగాకుండా శాసన సభ వ్యవహారాలను చక్క దిద్దటంలో దిట్టగా మంత్రి శ్రీధర్ బాబు పేరు సంపాదించుకున్నారని, మంత్రి శ్రీధర్ బాబు నిత్యం ప్రజా సేవలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన, విద్యాసంస్థల స్థాపన, ఆరోగ్య సేవల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంథనిని అభివృద్ధికి చిరునామాగా మార్చాయని, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మంథని ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తున్నారని. తెలంగాణ పెట్టుబడులకు కేరాఫ్ గా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఈఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే, పిఎసిఎస్ డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట్ల తిరుపతి యాదవ్, జనగామ సర్సింగారావు, పేరవేన లింగయ్య, అజీంఖాన్, గొటికార్ కిషన్, వొడ్నాల శ్రీనివాస్, సేగ్గేం రాజేష్, బండారి ప్రసాద్, డిగంబర్, మంథని శ్రీనివాస్, పర్ష శ్రీనివాస్, నీహారిక, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.