calender_icon.png 2 June, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ధ్వంసం

31-05-2025 03:17:44 PM

నడిగూడెం: నడిగూడెం కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(Nadigudem KLN Government Junior College)లో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డి.విజయ నాయక్ తెలిపారు. ఇటీవల ఇంటర్ వార్షిక పరీక్షల పర్యవేక్షణ కోసం ఇంటర్ బోర్డు కళాశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అట్టి కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి పక్కనపడేసారన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.