calender_icon.png 2 June, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

31-05-2025 03:34:04 PM

ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్, నెల్లికుదురు, ఇనుగుర్తి, కేసముద్రం, గూడూరు మండలాల పరిధిలోని 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి 94 లక్షల కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్(Shaadi Mubarak) చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) చేసిన అప్పులతో రాష్ట్ర ఆదాయంలో అధికంగా వడ్డీలు, అసలు కట్టడానికి ఇబ్బందిగా మారిందన్నారు. అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్లే తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని, ఆర్థికంగా కుదుట పడగానే ఎన్నికలకు ముందు ఇచ్చిన విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు.