1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

ధాన్యం వర్షార్పణం..

23-05-2025 01:29 AM

జయశంకర్ భూపాలపల్లి, (మహబూబాబాద్) మే 22 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా వర్షానికి తడిసిపోయింది. నగరంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ ప్రదేశం లో ఏర్పాటు చేయగా అందులో రైతులు ధాన్యాన్ని తెచ్చి విక్రయానికి ఉంచారు.

ఈ క్రమంలో భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోకి భారీగా వరద చేరడంతో చెరువుగా మారింది. రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడిందని రైతు ఎల్లయ్య కన్నీరు మున్నీరయ్యారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనేక కొర్రీలు పెడుతూ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయకుండా దాటవేత ధోరణి అవలంబించడం వల్ల తమకు తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.