సుల్తానాబాద్ కేడీసీసీబీ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, (విజయక్రాంతి ): రైతులకు ధాన్యం అమ్మకాలు చేయాగ బ్యాంకులో జమ రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(Peddapalli MLA Vijaya Ramana Rao) అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీబీ నూతన బ్రాంచ్ ను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ఆన్లైన్ లో చేయడంతో వెంటనే ట్రక్ సిట్ అప్డేట్ చేయడంతో వెంటనే బ్యాంకుల్లో ప్రభుత్వం అధికారులు జమ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ కరీంనగర్ అధ్యక్షులు కొండూరి రవీందర్,సి.ఈ.వో. సత్యనారాయణ రావు, డిసివో శ్రీమల, పాలకవర్గం సభ్యులు శ్రీగిరి శ్రీనివాస్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు పాల్గొన్నారు.






