17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలి

03-05-2025 12:00 AM

సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 2 (విజయక్రాంతి) : రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో రైస్ మిల్లులకు కేటాయించిన వరిధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

శుక్రవారం మందమర్రి మండల కేంద్రంలోని అంబికా సాయి, వాసవి, లక్ష్మీగణపతి, వెంకటేశ్వర్ రైస్ మిల్లులను మండల తహసీల్దార్ సతీష్‌తో కలిసి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

సన్న రకం వడ్లకు మద్ద తు ధరతో పాటు 500 రూపాయల అదన పు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన గోనె సం చులు, టార్పాలిన్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.

అవసరం మేరకు హమా లీ సంఖ్యను పెంపొందించుకొనాలని సూచించారు.  అనంతరం మండల కేం ద్రంలో లబ్దిదారులకు మంజూరైన రెండు పడక గదుల ఇండ్లను పరిశీలించారు. ఇండ్లలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, లబ్దిదారులు తమకు కేటాయించిన ఇంటిలో తప్పనిసరిగా ఉండాలని, ఆ దిశగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

మండల కేంద్రంలోని మండల పరి షత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సం దర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ప్రజలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను వేగవం తం చేసి అర్హులైన లబ్దిదారుల నుండి రుసుమును త్వరగా వసూలు చేయాలని తెలిపా రు.

మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి జాబితా రూపొందించాలని, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తిచేసి వివరాలతో నివేదిక తయా రు చేసి అందించాలని తెలిపారు. 

అనంతరం మండలంలోని పులిమడుగు గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణ చర్యలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వరి, సంబంధి త అధికారులు, రైస్ మిల్లుల యజమాను లు, తదితరులు పాల్గొన్నారు.