02-06-2025 01:21:23 AM
ఇందిరాగాంధీ స్టేడియంలో ఉత్సవాలకు ఏర్పాట్లు
కామారెడ్డి, జూన్ 1(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం విద్యుత్ దీపాల అలంకరణతో విద్యుత్తు లైట్ల వెలుగులతో కనువిందు చేస్తున్నాయి. త్రివర్ణ పతాకం అలంకరణలో విద్యుత్ లైట్లు అలంకరించడంతో జండా వాతావరణం తలపిస్తుంది.
ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, ఎస్పి రాజేష్ చంద్ర ,స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా అధికారు లు పాల్గొననున్నారు.
వివిధ శకటాలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధి రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అధికారులకు అందించనున్నారు.