27 May, 2026 | 5:25 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

08-11-2024 03:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రి వద్ద రోగుల సౌకర్యార్థం నూతనంగా బస్ స్టాప్ ను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ లు ప్రారంభించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.సూరిబాబు, ప్రచార కమిటీ కన్వీనర్ నాతరిస్వామిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నాయకులు వేడుకలు జరుపుకున్నారు. వేములపల్లి మండలంలో రుద్రపట్ల సంతోష్ కుమార్, కాసిపేట 1 గనిపై నాయకులు బన్నా లక్ష్మణ్ దాస్, కన్నెపల్లిలో నాయకులు మాధవరపు నర్సింగరావుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు.