27 May, 2026 | 6:33 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

వెల్దండలో యువ రైతు దారుణ హత్య

08-11-2024 03:50 PM

పొలం వద్ద కాపలాగా ఉండగా అర్ధరాత్రి బండరాళ్లతో మోది ఘాతుకం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): వేరుశనగ పంటను రక్షించేందుకు కాపలాగా వెళ్లిన యువరైతు దుండగుల చేతిలో అత్యంత దారుణంగా హత్య గవించబడ్డాడు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఎంజి కాలనీ తండాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాత్లావత్ రాజు(30) హిమబిందు ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికున్న పొలంలో వేరుశనగ పంట వేసుకొని వ్యవసాయ చేస్తున్నారు. గురువారం రాత్రి భోజనం అనంతరం వేరుశనగ పంటను అడవి పందుల నుండి కాపాడుకునేందుదుకు రాత్రి పొలం వద్ద కాపలాగా వెళ్లి అక్కడే నిద్రించాడు.

తెల్లవారుజామున ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య పొలం వద్ద వెతకడంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. గుర్తుతెలియని దుండగులు బలమైన బండరాళ్లతో తలపై మోదీ అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు గుర్తించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.