ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర
28-03-2026 12:00 AM
బైంసా మార్చి 27 (విజయక్రాంతి) : బైంసా పట్టణంలో శుక్రవారం శ్రీరాముడు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పలువురు ప్రముఖులు శ్రీరాముడికి పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో యాత్రను శాంతియు తంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయ హిందు ఉత్సవసమితి నాయకులు భక్తులు అధిక సంఖ్యను పాల్గొన్నారు. యువకులు శోభాయాత్రలో నృత్యాలు చేశారు.




