15 April, 2026 | 1:27 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

ఘనంగా సీతారాముల ఊరేగింపు

28-02-2026 01:26 AM

చివ్వెంల, ఫిబ్రవరి 27 : మండలంలోని కుడకుడ గ్రామంలో 14వ వార్డు న్యూ స్నేహ నగర్ కాలనీలో శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు భక్తి పారవశ్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని అత్యంత భక్తి భావంతో కాలనీ అంతటా ఊరేగించారు. భక్తులు సీతారాముల విగ్రహాలను చేతబట్టి ప్రతి వీధి, ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లి హారతులు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో కోలాటాలు ఆడుతూ భక్తి గీతాల నడుమ ఉత్సాహంగా పాల్గొనగా, యువత జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే సౌండ్ సిస్టమ్ల ద్వారా భక్తి సంగీతం మారుమోగగా, భక్తుల జైజైధ్వానాలతో కాలనీ అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. చిన్నారులు, పెద్దలు కలిసి పాల్గొనడం కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చింది. సమాజంలో ఐక్యతతో పాటు భక్తి భావాలను పెంపొందించే లక్ష్యంతో ఈ ఊరేగింపును నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.