09-06-2025 12:57:28 AM
హాజరైన ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి
తూప్రాన్, జూన్ 8 : అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవా లను ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పెద్ద మ్మ తల్లి, నల్ల పోచమ్మ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది, పెద్దమ్మ తల్లి వివాహ మహోత్సవంతో అమ్మవారికి బోనాల సమర్పించినారు.
ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలను జరిపించారు, ఈ సందర్భంగా నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మన్నె కృష్ణ, దోమలపల్లి కృష్ణ, ఆంజనేయులు, తలారి యాదగిరి, చింతల రవీందర్, ప్రశాంత్, పవన్, శేఖర్, మహేష్, రాహుల్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, అనిల్ రెడ్డి, ముదిరాజ్ గ్రామ పెద్దలు, పాల్గొని విజయవంతంచేశారు.