13-01-2026 02:25:06 AM
ఉప్పల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తుందని ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నుంచి వచ్చిన గ్రీటింగ్స్ కార్డును ఆమె లభిదారులుకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం లోని గృహ లక్ష్మీ పథకం కింద లక్ష కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
అర్హులై ఉండి నెలకు 200 యూనిట్లు లోపు వినియోగించిన పేద మధ్య తరగతి కుటుంబాలకు జీరో బిల్ కింద ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఇప్పటికే మహాలక్ష్మి పథకం గృహ లక్ష్మీ పథకం ప్రజలుసద్వినిచేసుకుంటున్నారని రజిత పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్ సుధాకర్ రెడ్డి రవి డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ లింగంపల్లి రామకృష్ణ ప్రభాకర్ రెడ్డి మహంకాళి రాజు పాల్గొన్నారు.