calender_icon.png 21 July, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దు

21-07-2025 11:29:34 AM

  1. ఉచితాలు తగ్గించి ఉపాధి కల్పించాలి 
  2. రాజకీయ నాయకులు వాడే భాష ఘోరం   
  3. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వం వైపుకు పథకాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దని ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) అభివర్ణించాడు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు వాడే బాష చాలా ఘోరంగా ఉందని, బాషను వాడి ప్రజల ఈసడింపు కు గురి కావొద్దన్నారు.నాగార్జున సాగర్ ఆయకట్టు కు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై  ఉందని తెలిపారు.ఎన్నికలలో వేల కోట్లు డబ్బులు ఖర్చుపెడుతున్నారని దింతో అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు కూడా నియంత్రించాలన్నారు. రాజకీయ పార్టీల వైఖరి తో అధికారుల్లో అవినీతి పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల సంఘం,సుప్రీం కోర్టు, కేంద్రం అవినీతిపై ద్రుష్టి సారించి ఎన్నికల్లో ఖర్చు చేసి విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United Andhra Pradesh)లో మద్రాస్ కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ ల అనుసంధానం జరిగిందని ఇచ్చంపల్లి నుండి నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తే తెలంగాణ కు మేలు జరుగుతుందని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ ను తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుందని బనక చర్ల ద్వారా తెలంగాణ కి నష్టం జరుగుతుందన్నారు. తీన్మార్ మల్లన్న,కల్వ కుంట్ల కవిత పిర్యాదులు నాకు అందాయని  ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం నాకు బాధను కలిగించిందన్నారు. చట్టపరంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని తెలిపారు.