24 March, 2026 | 10:27 AM

బాధితులకు సెల్ ఫోన్లు అప్పగింత

24-03-2026 12:00 AM

గట్టు, మార్చి 24: సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సంబంధించిన మూడు సెల్ ఫోన్లు రికవరీ చేసి వారికి అప్పగించినట్లు గట్టు ఎస్త్స్ర శేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. వీటిని సిఈఐ ఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు. అయితే ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేష న్లో సంప్రదించాలని ఎస్త్స్ర సూచించారు.

పోయిన ఫోన్ లను వెతికి పెట్టడానికి పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందన్నారు.సెల్ ఫోన్ల రికవరీ లో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు.తమ సెల్ ఫోన్ లను ఎస్త్స్ర వెంటనే రికవరీ చేయడం పట్ల బాధితులు హార్షం వ్యక్తం చేశారు.