10 May, 2026 | 8:12 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సాయిలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

10-08-2025 02:30 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల(Marriguda Mandal) పరిధిలోని తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు సాయిలు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న(2004-2006) బ్యాచ్ వారి స్నేహితులు వారి కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ, సాయిలు చనిపోవడం చాలా బాధాకరమని, మేము చదువుకునే రోజుల్లో ఎంతో క్రమశిక్షణతో ఆయన మెలిగేవారని, అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం ఎంతో బాధగా ఉందని వారు అన్నారు. సాయిలు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి కార్తీష్ రెడ్డి, నీల ఆంజనేయులు, ఆడపు జంగయ్య, నిరంజన్, ప్రవీణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.