calender_icon.png 13 June, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బందిపై వేదింపులు.. నిధుల దుర్వినియోగంపై విచారణ

12-06-2025 09:14:56 PM

ఆరోపనలు ఎదుర్కోంటున్న పెన్ పహాడ్ మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెచ్ఐఓ చంద్రశేఖర్రాజు..

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వేదింపులు-పైనల పంచాయతీ..

సూక్ష్మంగా విచారణ చేపట్టిన డిప్యూటీ డి ఎం హెచ్ ఓ , పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం..

పెన్ పహాడ్: గెటౌట్.. నేనే మంత్రి.. అతనే (హెచ్ఐఓ) బాస్..మేము చెప్పింది వినాల్సిందే.. మాకు ఎదురుమల్లితే మీ భవిష్యత్ ఇంతే సంగతులు అంటూ.. బెదిరింపులకు గురి చేస్తూ తాము అనుకున్న లక్ష్యాన్ని ఎవరు అడ్డు రావద్దని ఎక్కడికక్కడ వేదింపులతో చెక్ పెడుతున్నారు ఆ ఇద్దరు మండల వైద్య బాసులు. ఇదిలా ఉంటే ఏకంగా సిబ్బంది నుంచి ఎంటీ చెక్ లు తీసుకొని ప్రజా సొమ్మును స్వంత అకౌంట్లలోకి మార్చుకుంటూ లక్షల రూపాయలు దుర్వినియోగం చేసినందుకు సిబ్బంది ఇదేమని అడిగితే బెదిరింపులు గురిచేస్తూన్నారని పెర్కొంటూ ఏకంగా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఎకు ఫిర్యాదు చేశారు.

ఆరోపనలు ఎదుర్కోంటున్న వైద్యాధికారి తనపైనే సిబ్బంది ఫిర్యాధు ఇచ్చినందుకు 'తాను డ్యూటీ చేయలేక పోతున్నా.. సిబ్బంది సహకరించడం లేదని' జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ కు ఇటీవల మొరపెట్టుకుంటూ బోరున విలపించగానే విచారణకు ఆదేశించారు కలెక్టర్. ఈ పంచాయతీ తంతు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈమేరకు గురువారం ఏకంగా వైద్యారోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. కోటిరత్నం విచారణకు వచ్చారు.

వివరాల్లోకి వెళ్ళితే.. మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో విధులు నిర్వర్తిస్తున్న మండల వైద్యాధికారి డాక్టర్. స్రవంతి జూన్-2న నిర్వహించిన ఏఎన్ఎంల సమావేశంలో రికార్డులు ఎందుకు తీసుకురాలేదని టేబుల్పై ఉన్న రికార్డును తీసుకొని ఏఎన్ఎం మొఖంపై విసిరి వేసి దురుసుగా మాట్లాడి 'గేటౌట్' అంటూ సంబోధన చేయడంతో అవాక్కైన ఏఎన్ఎంలంతా కలసి సమావేశం మందిరం నుంచి బైకాడ్ చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెచ్ఐఓ చంద్రశేఖర్రాజు తమని వేదింపులు గురి చేస్తున్నారని తాము విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఇదే మా వైద్యాధికారికి పలుసార్లు ఉత్తమ అవార్డు పథకాలు ఎలా తీసుకుంటారని ఫిర్యాధు చేశారు.

అంతేకాదు హెచ్ఐఓ చంద్రశేఖర్రాజు ఏఎన్ఎంలను బెదిరించి 'డాక్టరమ్మ పంపించింది.. జాస్ నిధులకు సంబందించి డ్రా చేయాలని.. ఎంటీ చెక్ లు ఇవ్వమన్నదని' బెదిరించి ఎంటీ చెక్లు తీసుకుపోయి తన స్వంత ఎకౌంట్లోకి తర్జుమా చేసుకొని మండల వైద్యాధికారి, హెచ్ఈఓలు కలసి నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాధులో పెర్కోన్నారు. అంతేకాకుండా పలు అంశాల మీద సమగ్ర విచారణ చేపట్టి తుది నివేదికను జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఎకు అందజేస్తున్నట్లు విచారణ అధికారిని డాక్టర్. కోటిరత్నం తెలిపారు. సోమవారం రోజున విచారణ జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.