calender_icon.png 14 June, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లావ్యాప్తంగా మహిళల ద్వారా ఇసుక పాయింట్ నిర్వహణకు ప్రణాళిక

11-06-2025 12:44:05 AM

సింధు గ్రామ సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన ఇసుక పాయింట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూన్ 10 (విజయ క్రాంతి):మహిళా సమాఖ్యపై పెట్టిన నమ్మకం నిలబెట్టాలని, పారదర్శకంగా ఇసుక రవాణా జరగాలని, ఎటువంటి అక్రమాలు జరగడానికి వీలు లేదని జిల్లా కలె క్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.మంగళవారం చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో సింధు గ్రామ సమాఖ్య ద్వారా ఏర్పాటు చేసిన ఇసుక పాయింట్  ను జిల్లా కలెక్టర్  పరిశీలించారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో సింధు గ్రామ సమాఖ్య ద్వారా ఇసుక పాయింట్ ఏర్పాటు చేసామని, ఇక్కడ ఎటువంటి అవకతవకలు అక్రమాలు జరగడానికి వీలు లేదని అన్నారు. కూపన్ ఆధారంగా మాత్రమే ఇసుక పాయింట్ నుంచి ఇసుక తరలింపు జరగాలని అన్నారు.

ప్రతి రోజు ఎన్ని ట్రిప్పులు ఇసుక పోతుంది, ఎవరైనా ఒత్తిడికి గురి చేస్తున్నారా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఇసుక కూపన్ లను, చెరువు వద్ద లోడ్ అవుతున్న ట్రాక్టర్ వద్ద ఉన్న కూపన్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దారు కె. అనంతరాజు, ఎంపిడిఓ శ్రీనివాస్ రావు, ఏపిఎం శ్రీనివాస్ రావు, సింధు గ్రామ సమాఖ్య సభ్యులు బేబీ రాణి, లక్ష్మీ, ఇందిరా, భాగ్యలక్ష్మి, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.