9 May, 2026 | 9:49 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరట

02-03-2025 12:31 AM

రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లకు హైకోర్టు ఊరట కల్పించింది. 16 ఏళ్ల లోపు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని తాజాగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ఇటీవల హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలను షోలకు తీసుకెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనలతో న్యాయ స్థానం సైతం ఏకీభవించింది.

ఈ క్రమంలోనే రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకూ పదహారేళ్లలోపు పిల్లలకు అనుమతించడానికి వీల్లేదంటూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఆదేశాల కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని.. కాబట్టి ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. వారి వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును సవరించింది.