17-10-2025 10:10:25 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లాల గ్రామంలో ఇతర బ్యాంకులకంటే మరింత అధిక వడ్డీ సీనియర్ సిటిజన్స్, మహిళలకు ప్రయోజనం కరపత్రాలతో ప్రచారం నిర్వహించిన తంగళ్ళపల్లి కేడీసీసీ బ్యాంక్ సిబ్బంది, కేడీసీసీ బ్యాంకు అందిస్తున్న ‘సౌభాగ్య’ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ మహమ్మద్ నవాబ్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ఇంటింటా కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో మేనేజర్ సిబ్బందితో కలిసి కరపత్రాలతో సౌభాగ్య పిక్స్ డ్ డిపాజిట్ పథకంపై ప్రచారం నిర్వహించారు.ఇతర బ్యాంకుల కంటే కేడీసీసీ బ్యాంక్ 333 రోజుల కాలపరిమితికి సౌభాగ్య పథకంలో సాదారణ ప్రజలకు సుమారు 8 శాతం, సీనియర్ సిటిజన్స్,మహిళలకు సుమారు 8.5 శాతం వడ్డీ అందజేస్తుందని మేనేజర్ నవాబ్ తెలిపారు.వివరాలకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ కార్యాలయాన్ని సంప్రదించాలని మేనేజర్ కోరారు.