12 March, 2026 | 9:35 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

రాష్ట్ర బంద్ కు ఆర్పీఐ(ఎ) సంపూర్ణ మద్దతు

17-10-2025 10:07 PM

మందమర్రి,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ లు 42% అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసి సంఘాలు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియ (ఆర్పిఐఎ) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని (ఆర్పిఐఎ) రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగపిండి రమేష్ కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఇంటింటి సర్వే ద్వారా కులగణన చేపట్టి సర్వే ఆధారంగా బీసీలకు రావలసిన రిజర్వేషన్లు  అమలు చేయడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వారి ఉనికిని చాటుకోవడానికి బీసీలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.  బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త బంద్ లో పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.