పేద ప్రజల సొంత ఇంటి కలలు నిజం చేస్తాం
బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయాలన్న దృక్పథం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. శనివారం బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో స్థానిక సర్పంచ్ కృష్ణ కాంత్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ లబ్ధిదారులు శీతల విజయ్ సుమన్ ఇంటిని ప్రారంభించారు.
గృహప్రవేశం అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హులు అయిన వారందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు మంజూరు అవుతాయన్నారు .కార్యక్రమంలో గిన్నూరు సర్పంచ్ ప్రియాంక భీమేష్ మండల అధ్యక్షులు జెల్ కే పాండు రంగు సీనియర్ నాయకులు చిలుకూరు భూమన్న గవ్వల దేవేందర్ డిసిసి కార్యదర్శి కిషన్ బొజ్జ సాయన్న సురేష్ మారుతి తాండ్ర వెంకటరమణ ముకుందరావు రవి రాఘవరెడ్డి డెక్కన్ నరసింహులు పద్మనాభం తదితరులు ఉన్నారు.






