28 June, 2026 | 2:15 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే

09-05-2026 02:25 PM

బోథ్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన చివరి గింజ వరకు పంట కొనుగోలు చేపట్టాలని అంతేగాక ఎకరానికి 20 కింటల్లా జొన్న పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ధన్నూర్ గ్రామంలో రైతుల కోరిక మేరకు శనివారం జొన్న పంట కొనుగోలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు అన్నారు.

అంతేగాక అగ్ని ప్రమాదాల వల్ల వంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకుగాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఆదుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో అన్నిచోట్ల జొన్న కొనుగోలు చేపట్టడం జరుగుతుందన్నారు రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హేల్మ రోహిణి వినయ్ రెడ్డి తోపాటు ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ సొసైటీ చైర్మన్ కదం ప్రశాంత్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు